యాప్నగరం

ఇడుపులపాయలో వైఎస్‌కు సీఎం జగన్, కుటుంబ సభ్యుల నివాళి

ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తండ్రికి ఘనంగా నివాళులు అర్పించిన జగన్. రెండు రోజులుగా కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.

Samayam Telugu 24 Dec 2019, 11:40 am
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇడుపులపాయ వెళ్లిన సీఎం.. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌పై పూల మాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్‌తో పాటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్‌కు నివాళులు అర్పించారు.
Samayam Telugu cm

అంతకముందు వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాయచోటి వెళ్లి.. అక్కడ పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ఇటు ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, సహనం, త్యాగం, క్షమాగుణం క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయన్నారు ముఖ్యమంత్రి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.