యాప్నగరం

రేపు ఢిల్లీకి సీఎం జగన్.. అమిత్‌ షాతో భేటీ! అందుకేనా?

రాజద్రోహం కేసులో అరెస్టు చేసి చావబాదారని.. ఎంపీగా ఉన్న తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కేంద్ర మంత్రులకు, ఎన్‌హెచ్చార్సీకి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్‌ ఆసక్తికరంగా మారింది.

Samayam Telugu 9 Jun 2021, 4:56 pm
ఏపీ సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మల, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌లను కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. మిగిలిన మంత్రుల అపాయింట్‌మెంట్ కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. గతవారమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన జరగాల్సి ఉంది. అయితే కేంద్ర మంత్రులు అందుబాటులో లేకపోవడంతో టూర్ రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం అమిత్‌ షా సహా కొందరు మంత్రుల అపాయింట్‌మెంట్ దొరకడంతో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
jagan


అయితే ఈసారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలసి ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖకు కూడా ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఎం జగన్ టూర్‌పై ఆసక్తి నెలకొంది. రఘురామ వ్యవహారం, బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఉత్కంఠ రేపుతోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.