యాప్నగరం

జగనన్న తోడు పథకం కింద ఒక్కో అకౌంట్‌లో రూ.10వేలు జమ.. ఎలా చెక్ చేసుకోవాలంటే!

Jagananna Thodu Scheme కింద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లబ్ధిదారులకు అకౌంట్‌లో డబ్బులు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణం.. మొత్తం రూ.395 కోట్లు బటన్ నొక్కి విడుదల చేశారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సమయంలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానన్నారు సీఎం జగన్. అందుకే వారి కోసం జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీరిలో కూడా 80శాతంమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలే ఉన్నారన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 11 Jan 2023, 12:52 pm
ఆంధ్రప్రదేశ్‌లో చిరు వ్యాపారులకు జగన్ సర్కార్ అండగా నిలిచింది. ఈ ఏడాది కూడా జగనన్న తోడు (Jagananna Thodu) పథకం కింద నిధులు విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) బటన్ నొక్కి వారి అకౌంట్‌లలో డబ్బులు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణం.. మొత్తం రూ.395 కోట్లను విడుదల చేశారు. జిల్లాల నుంచి మంత్రులు, కలెక్టర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు. సీఎం కొంతమంది లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
Samayam Telugu Jagananna Thodu


తన పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని.. అప్పుడే వారికి ఏదైనా మంచి చేయాలని భావించానన్నారు సీఎం. చిరు వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారుల వడ్డీ భరిస్తుంది అన్నారు జగన్. ఇంకా ఏవరైనా అర్హత ఉండి కూడా పథకం అందకపోతే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామన్నారు. జగనన్న తోడు పథకం చిరు వ్యాపారుల జీవనోపాధికి ఉపయోగపడుతోందని.. వ్యాపారులకు పెట్టుబడికి కష్టం రాకూడదనే ఇలా రుణం అందజేస్తున్నామన్నారు.

చిరు వ్యాపారులకు ఒక్కొక్కిరికి రూ.10వేల చొప్పున ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రుణం అందిస్తున్నామన్నారు. 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు తెలిపారు. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చేశామని చెప్పారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారన్నారు.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకంలో చేరాలంటే.. ఆయా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత కలిగిన రూ.10 వేల రుణం లభిస్తుంది. గ్రామ వాలంటీర్‌ను సంప్రథించినా పథకానికి సంబంధించిన వివరాలు ఇస్తారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, చేతి వృత్తులు వారు ప్రయోజనం పొందొచ్చు. కచ్చితంగా 18 ఏళ్లు వయసు నిండి ఉండాలి.. ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి.

కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే రూ.10 వేలకు లోపు, పట్టణాల్లో రూ.12 వేలులోపు ఉండాలి. విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలనే నిబంధన ఉంది. ఒకవేళ షాపు ఉంటే కనుక రిజిస్ట్రేషన్ పత్రం కావాలి.. పొలం 10 ఎకరాలకు లోపు ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం కింద రూ.10వేల రుణం అందిస్తోంది.

గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల సర్వే నిరంతర సామాజిక తనిఖీ కోసం అర్హుల జాబితా గ్రామ/వార్డు సచివాలయల్లో ప్రదర్శిస్తారు. పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా www.gramawardsachivalayam.ap.gov.in పోర్టల్ ఏర్పాటు చేశారు. అలాగే అర్హతలు ఉండి జాబితాలో పేరులేనివారు గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిష్కారం చేస్తారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.