యాప్నగరం

కర్నూలు ఘటనపై సీఎం జగన్ సీరియస్.. కమిషనర్‌ బదిలీ!

కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసులు కూడా పెట్టొచ్చని.. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సూచించారు.

Samayam Telugu 30 Apr 2020, 3:56 pm
కరోనా నివారణ, లాక్‌డౌన్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్న ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. ఇది చాలా దారుణమని.. కరోనా ఎవరికైనా సోకొచ్చని.. అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చని వ్యాఖ్యానించారు. కరోనా సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని.. వారిపై సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం మంచిది కాదన్నారు.
Samayam Telugu jagan


ఇలాంటి ఘటనలతో తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు జగన్. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసులు కూడా పెట్టొచ్చని.. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సూచించారు. ఇదిలా ఉంటే కర్నూలు కమిషనర్‌ రవీంద్రబాబుపైనా బదిలీ వేటు పడింది. నూతన కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి బాలాజీని నియమించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు.. వైరస్ తగ్గడంతోనే వారు డిశ్చార్జి అవుతున్నారని సీఎం గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే అన్నాు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.