యాప్నగరం

ఆరోగ్య శ్రీ విషయంలో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్

రాష్ట్రంలో హెల్త్‌ క్లినిక్‌లు‌ వచ్చే వరకు ఆరోగ్యశ్రీ రెఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Samayam Telugu 29 Oct 2020, 6:19 pm
ఆరోగ్య శ్రీకి సంబంధించి జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే నెల 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. అవసరమనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను కూడా జాబితాలో చేర్చాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద చేపట్టే పనులకు సంబంధించి నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ, పనులపై అధికారులను అడిగి వివరాలు ఆరా తీశారు. వీటికి దాదాపు రూ.17,300 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. వైద్య కళాశాలల్లో ‘నాడు-నేడు’ పనులకు మరో రూ.5,472 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలపగా.. వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో హెల్త్‌ క్లినిక్‌లు‌ వచ్చే వరకు ఆరోగ్యశ్రీ రెఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Samayam Telugu ap cm ys jagan review on nadu nedu in health department
ఆరోగ్య శ్రీ విషయంలో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్


రాష్ట్రంలో కొత్తగా తీసుకొస్తున్న 16 వైద్య కళాశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధితో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలపై అధికారులతో చర్చించారు. వైద్య కళాశాలల నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరిలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాశాలల నిర్మాణాలకు నవంబర్‌లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో నిర్మించనున్న వైద్య కళాశాలలకు డిసెంబర్‌లో టెండర్లు పిలవాలన్నారు. విజయనగరం, రాజమహేంద్రవరం, పెనుకొండ, అమలాపురం, ఆదోనిలో వైద్య కళాశాలలకు జనవరిలో టెండర్లకు ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.