యాప్నగరం

కరోనా కేసులపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ఏపీ సీఎం!

. కొవిడ్ వస్తుంది.. పోతుంది.. కరోనాతో జీవించాల్సిన పరిస్థితి ఉందన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని.. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్ ఉండదన్నారు.

Samayam Telugu 28 Jul 2020, 2:19 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.. కరోనా నివారణ, జిల్లాల పరిస్థితిపై చర్చించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్క అధికారి సీరియస్‌గా పనిచేస్తున్నారని.. 90శాతం టెస్టులు కోవిడ్ క్లస్టర్లతో చేస్తున్నామన్నారు. దేశంలో రోజుకు 50వేలు టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు జగన్. ప్రతి మిలియన్‌కు 31వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని సీఎం అన్నారు.
Samayam Telugu సీఎం జగన్


Read Also: YS Jagan‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ.. కేసీఆర్ లాజిక్‌తో!

కొవిడ్ వస్తుంది.. పోతుందని.. కరోనా సోకినవారికి వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. కొవిడ్ వస్తుంది.. పోతుంది.. కరోనాతో జీవించాల్సిన పరిస్థితి ఉందన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని.. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత వైరస్ ఉండదన్నారు. కేసులు ఎక్కువగా వస్తున్నాయని భయపడి, పరీక్షలు తగ్గించి.. రిపోర్టులు తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తారని.. కానీ ఏపీలో మాత్రం ఎప్పుడూ అలా జరగలేదన్నారు. పరోక్షంగా తెలంగాణలో పరిస్థితుల్ని ప్రస్తావించినట్లు చర్చ జరుగుతోంది.

Also Read: గుంటూరు: కొవిడ్‌ ఆస్పత్రిలో ప్రేమకథ.. వెరీ ఇంట్రెస్టింగ్

రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదైనా.. సగం మందికి నయమైందని తెలిపారు. దేశంలో కరోనా మరణాల రేటు 2.5శాతంగా ఉంటే రాష్ట్రంలో 1.06 శాతమని వివరించారు. 85 శాతం మందికి ఇళ్లలోనే నయమైందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరోనాపై ఎవరికీ భయాందోళనలు ఉండకూడదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.