యాప్నగరం

ఆ జీవోపై జగన్ సీరియస్.. రద్దు చేయాలని ఏపీ సీఎం ఆదేశం

ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరును మార్చడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్. వెంటనే జీవో రద్దు చేయాలని ఆదేశించిన సీఎం. మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలన్న జగన్.

Samayam Telugu 5 Nov 2019, 11:56 am
ఏపీలో పదోతరగతి విద్యార్థులకు అందించే ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ఈ విషయం తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రతిభా పురస్కారాలు పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆదేశించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును కొనసాగించాలన్నారు. అంతేకాదు మహనీయుల పేర్లను అవార్డులకు పెట్టాలని సూచించారు. గాంధీ, అంబేద్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలన్నారు.
Samayam Telugu cm jagan.


10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అందించే ప్రతిభ అవార్డు పేరును మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు మీద ఇచ్చే ఈ అవార్డును వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుగా మార్చారు. ప్రతి ఏటా అబ్దుల్ కలాం పుట్టినరోజు నాడు ప్రతిభ అవార్డులు కింద విద్యార్థులకు ఇచ్చే ఈ అవార్డు పేరును.. (Dr. A. P. J Abdul Kalam Pratibha Puraskar)ను.. తాజాగా ఈ పేరుని (YSR Vidya Puraskar)గా మార్చేశారు.

ఈ జీవోపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అబ్దుల్ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారని ప్రతిభా పురస్కారాలకు ఆయన పేరు పెట్టామని.. జగన్ సర్కార్ దీన్ని కూడా మార్చడం సరికాదన్నారు. ఇది ఆయన్ను అవమానించడమేనన్నారు చంద్రబాబు. జీవోపై విమర్శలు రావడంతో సీఎం స్పందించారు.. జీవోను రద్దు చేయమని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.