యాప్నగరం

విజయదశమి శుభాంక్షలు తెలిపిన జగన్, కేసీఆర్.. ఇద్దరు సీఎంలదీ ఒకే స్టయిల్

దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచిదే విజయమమన్నారు.

Samayam Telugu 8 Oct 2019, 9:20 am
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకొంటున్నారు. విజయాలను చేకూర్చే విజయదశమి వేడుకలను తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకొంటున్నారు. దసరా పండుగ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇరు రాష్ట్రాల గవర్నర్లు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తులపై దుర్గా మాత సాధించిన విజయాన్ని ఉత్సవంగా జరుపుకొందాం. అందరికీ దసరా శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Samayam Telugu jagan kcr2


తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినానా ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. దుష్ట శక్తులపై ఎప్పటికీ మంచిదే విజయమని కేసీఆర్ తెలిపారు. దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు అందించడం కోసం జగన్‌తోపాటు తెలంగాణ సీఎంవో ఇంగ్లిష్ ట్వీట్ చేయడం గమనార్హం.
తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజయాలను చేకూర్చే విజయ దశమి పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... దసరా శుభాకాంక్షలు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.