యాప్నగరం

మామ గంగిరెడ్డి స్మృతిలో.. మళ్లీ పులివెందులకు సీఎం జగన్

సోమవారం మళ్లీ పులివెందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. పులివెందుల పర్యటన తర్వాత ఢిల్లీకి సీఎం.

Samayam Telugu 5 Oct 2020, 8:24 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ పులివెందుల వెళుతున్నారు. సీఎం మామ డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి శనివారం కన్నుమూసిన సంగతి తెలసిందే..డాక్టర్‌ గంగిరెడ్డి సంస్మరణ సభను ఆయన కుటుంబ సభ్యులు భాకారాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఆ సభకు సీఎం హాజరై.. నివాళులు అర్పించనున్నారు. పులివెందులలో కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. తర్వాత ఢిల్లీ బయలు దేరి వెళతారు. సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
Samayam Telugu వైఎస్ జగన్


ఉదయం 9.00 ముఖ్యమంత్రి తాడేపల్లెలోని నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు బయలు దేరుతారు. 9.20 గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 9.30 గన్నవరం ఎయిర్‌ పోర్టునుంచి విమానంలో బయల్దేరి.. 10.10 కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 10.15 కడప ఎయిర్‌ పొర్టు నుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరి.. 10.35 పులివెందులలోని భాకారాపురంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.. తర్వాత భాకారాపురంలోని నివాసానికి బయలు దేరుతారు. 10.50 భాకారాపురంలోని నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుని.. 10.50 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.00 పులివెందుల నివాసం నుంచి హెలీప్యాడ్‌కు బయలు దేరుతారు.. 1.15 హెలీక్యాప్టర్‌లో కడప ఎయిర్‌ పోర్టుకు బయలుదేరుతారు.

1.40 కడప ఎయిర్‌ పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలు దేరుతారు. 2.20 గనవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుని.. 2.30 గన్న వరం ఎయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళతారు. సాయంత్రం5.00 ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు చేరుకుని.. ఎయిర్‌ పోర్టు నుంచి 1–జనపథ్‌కు బయల్దేరతారు. 5.50 ఢిల్లీలోని1– జనపథ్‌కు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో సమావేశంకానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.