యాప్నగరం

జగన్ సర్కార్ శుభవార్త.. నేడు వాళ్ల అకౌంట్లోకి రూ.10వేలు జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. తాజాగా మరో పథకాన్ని లాంఛ్ చేసేందుకు సిద్దమయ్యారు.

Samayam Telugu 10 Jun 2020, 7:30 am
ఏపీలో సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకెళుతున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. తాజాగా మరో పథకాన్ని లాంఛ్ చేసేందుకు సిద్దమయ్యారు.. బుధవారం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ)లకు రూ.10వేలు జమ చేయనున్నారు.
Samayam Telugu సీఎం జగన్


ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడారు.. లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు.

ఈ డబ్బును లబ్దిదారులు తమ వృత్తికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసుకునేందుకు ఈ ఆర్థిక సాయాన్ని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా షాపులున్న1,25,926 మంది టైలర్లకు రూ. 125,92,60, 82,347 మంది రజకులకు రూ. 82,34,70, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 38,76,70 మొత్తం 2,47,040 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.