యాప్నగరం

ఈ నెల 23న తిరుమలకు సీఎం జగన్.. రెండు రోజుల పాటూ పర్యటన

జగన్‌తో పాటూ తిరుమలకు కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా రానున్నారు. ఈ నెల 23న తిరుమల చేరుకోనున్న జగన్.. గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Samayam Telugu 12 Sep 2020, 11:19 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండ్రోజుల పాటూ ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో ఉంటారు. జగన్‌తో పాటూ తిరుమలకు కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా రానున్నారు. ఈ నెల 23న తిరుమల చేరుకోనున్న జగన్.. గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Samayam Telugu సీఎం జగన్


అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపనలో సీఎం జగన్, యడియూరప్పలు పాల్గొనున్నారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహంకు చేరుకోని అల్పాహారం స్వీకరించి జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రతి ఏటా తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు జరుగుతాయి. గరుడ సేవ రోజు ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి శ్రీవారి బ్రహోత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.