యాప్నగరం

కేసీఆర్, చంద్రబాబు బాటలో జగన్.. ఆగస్ట్‌కు ఫస్ట్ టార్గెట్!

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ పనుల్ని పరుగులు పెట్టించేందుకు క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించిన జగన్.. అధికారులతో సమీక్షలు.

Samayam Telugu 20 Feb 2020, 4:46 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలు, ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టారు. నేరుగా సీఎం రంగంలోకి దిగుతున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్‌లో ప్రాజెక్ట్‌ పనుల్ని పరుగులు పెట్టించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలు పెట్టారు. జగన్ గురువారం ప్రకాశం జిల్లాలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. అక్కడ పనుల్ని పరిశీలించి.. ఇరిగేషన్ అధికారులతో జగన్‌ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
Samayam Telugu jagan


ఈ ఏడాది ఆగస్టు నాటికి వెలుగొండ మొదటి దశ పనులు పూర్తిచేయాలని జగన్ సూచించారు. లక్షా 18వేల ఎకరాలకు సాగునీరు.. మూడున్నర లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంగా ముందుకు సాగాలి అన్నారు. ప్రాజెక్ట్ పనుల్ని మరింత వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమ ప్రకాశం ప్రాంతమంతా సస్యశామలం చెయ్యాలని దృఢ సంకల్పంతో ఉన్నామంటున్నారు.

ఇక కొల్లం వాగు దగ్గర హెడ్ రెగ్యులేటర్ పనులు మార్చి 1న ప్రారంభించి.. సొరంగం రెండువైపులా ఒకేసారి తవ్వకాలు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలంటే రూ.1800 కోట్లు అవసరమని అధికారులు తెలపగా.. వెంటనే రూ. 1158 కోట్లు విడుదల చేస్తామని సీఎం జగన్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.