యాప్నగరం

ఒకే ఫ్రేమ్‌లో సీఎం జగన్, ‘ఎర్ర’ స్మగ్లర్.. తిరుపతిలో కలకలం!

తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటోలు ఉన్న ఫ్లెక్సీ వివాదాస్పదమవుతోంది.

Samayam Telugu 11 Dec 2020, 4:10 pm
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోని వైకుంఠపురంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. తిరుపతి లో ఇలాంటి ఫెక్సీలు పెట్టడం నిషేధం. కానీ, ఎర్ర చందనం స్మగ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిని హోటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న ఫ్లెక్సీలను వైకుంఠపురంలో ఏర్పాటు చేశారు. కొల్లం గంగిరెడ్డితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోలతో కూడిన ఫొటోలను ఆ ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు. దీంతో ఈ ఫ్లెక్సీ తీవ్ర వివాదాస్పదమవుతోంది.
Samayam Telugu సీఎం జగన్

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం ఉంది. ఈ నిషేధం చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై చర్చ సాగుతోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలను అతిక్రమించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఫ్లెక్సీలో హోటల్‌ను ప్రారంభించబోయే గంగిరెడ్డిపై ఎర్రచందనం స్మగర్ల్ అనే ఆరోపణలున్నాయి. గతంలో అతడు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జైలుకు సైతం వెళ్లాడు. ఈ తరుణంలో సీఎం జగన్ ఉన్న ఫొటోలో గంగిరెడ్డి ఫొటో ముద్రించడం చర్చనీయాంశమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.