యాప్నగరం

సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.. ఆఖరి నిమిషంలో నిర్ణయం

Hyderabad: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఖరి నిమిషంలో తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

Samayam Telugu 25 Nov 2020, 11:04 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనను ఆఖరు నిమిషంలో రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి జరిగే రెండు వివాహాలకు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది. ఇందుకు గాను బుధవారం సాయంత్రం బయల్దేరి.. తిరిగి రాత్రి 9.30కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకునేలా షెడ్యూల్ వేశారు. కానీ, చివరి నిమిషంలో సీఎం జగన్ తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
Samayam Telugu ముఖ్యమంత్రి వైఎస్ జగన్


ముందుగా అనుకున్న దాని ప్రకారం సీఎం జగన్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే ఓ పారిశ్రామికవేత్త కుమార్తె వివాహానికి హాజరు కావాల్సి ఉంది. ఆ తర్వాత ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. తర్వాత సీఎం జగన్ తన సొంత దినపత్రిక సంపాదకుడి ఇంట జరిగే మరో వివాహానికి హాజరైన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ-గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్ళేలా ప్లాన్ చేశారు.

అయితే, బంగాళాఖాతం మీదుగా దూసుకు వస్తున్న నివర్ తుఫాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం వుండడంతో జగన్ తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నట్లు సీఎంఓ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.