యాప్నగరం

మంత్రి పేర్ని నాని ఇంట విషాదం.. స్వయంగా ఇంటికెళ్లిన సీఎం జగన్

Perni Nani: రాష్ట్ర మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు.

Samayam Telugu 21 Nov 2020, 5:07 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఇటీవలే మంత్రి పేర్ని నాని తల్లి గురువారం (ఈ నెల 19న) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో శనివారం పేర్ని నాని ఇంటికి వెళ్లిన సీఎం జగన్.. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
Samayam Telugu మంత్రి పేర్ని నానిని పరామర్శిస్తున్న సీఎం జగన్


మంత్రి పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మచిలీపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే పూర్తిగా కోలుకుందని భావించి ఆమెను వైద్యులు డిశ్చార్జి చేయగా, మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూశారు. కాగా, నాగేశ్వరమ్మ భర్త పేర్ని కృష్ణమూర్తి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పేర్ని నాని నిర్వహిస్తున్న సమాచార మంత్రిత్వ శాఖనే.. ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి కూడా నిర్వహించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.