యాప్నగరం

ఆస్పత్రిలో చేరిన వైఎస్ భారతి తండ్రి.. హుటా హుటిన హైదరాబాద్‌కు సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 10 గంటలకు తిరుమల నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోన్నారు.

Samayam Telugu 24 Sep 2020, 10:35 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి షెడ్యూల్‌లో మళ్లీ మార్పులు జరిగాయి. తిరుమల పర్యటన ముగిసిన అనంతరం ఉదయం 10 గంటలకు తిరుమల నుంచి నేరుగా హైదరాబాద్‌కు సీఎం వెళ్లనున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోన్నారు. ఉదయం 11:20 గంటలకు నగరంలోని కంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లనున్నారు.. అక్కడ చికిత్స పొందుతున్న వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డిని సీఎం జగన్ పరామర్శించనున్నారు. తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు జగన్ గన్నవరం రానున్నారు.
Samayam Telugu సీఎం జగన్


అనారోగ్య కారణాలతో వైఎస్ భారతి తండ్రి హైదరాబాద్ కంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆయన పరామర్శకు వెళుతున్నారు. అంతక ముందు గురువారం ఉదయం జగన్ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కర్ణాటక సత్రాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఏపీ సీఎం తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.