యాప్నగరం

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. పునఃవ్యవస్థీకరణ తర్వాత తొలిసారి

ఏపీ ముఖ్యమంత్రి గత నెలలో తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టిన విషయం తెలిసిందే. మంత్రివర్గంలోని సభ్యులందరితోనూ రాజీనామా చేయించి.. కొత్తగా క్యాబినెట్‌ను ఏర్పాటుచేశారు. కేవలం కొద్ది మంది పాతవారికి మాత్రమే రెండో సారి అవకాశం కల్పించారు. వాస్తవానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే రెండున్నరేళ్లే మంత్రులుగా కొనసాగిస్తానని జగన్ ప్రకటించారు. గతేడాది డిసెంబరులోనే మంత్రివర్గాన్ని పునఃవ్యవస్థీకరించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఏప్రిల్‌లో చేపట్టారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 12 May 2022, 9:19 am

ప్రధానాంశాలు:

  • గత నెలలో క్యాబినెట్‌లో సీఎం జగన్ మార్పులు.
  • కొద్ది మంది పాత మంత్రులకే మంత్రివర్గంలో చోటు.
  • దేవాదాయ భూముల వ్యహారంపై క్యాబినెట్‌లో చర్చ.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వైఎస్ జగన్
Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy
మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా గురువారం క్యాబినెట్ సమావేశ కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. గత నెల తొలి మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాత, కొత్తల కలయికతో కొత్త మంత్రివర్గం ఏర్పడింది. క్యాబినెట్ ఏర్పడిన నెల రోజుల తర్వాత మొదటి సమావేశం జరగనుండగా.. ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ముఖ్యంగా దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే, దిశా చట్టం సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని భోగట్టారు. అమ్మ ఒడి పథకం, గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం.

మరోవైపు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారులపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్‌ అండ్‌ బీ మంత్రి దాడిశెట్టి రాజా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొననారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో రహదారులను బాగు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని, ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ముందుకుసాగుతోందని తెలిపారు. దీనికోసం ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతున్నారని, ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లను తయారు చేయాలని సూచించారు. ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయ ప్రగతి కనిపించాలని ఆదేశించారు. ఆర్‌ అండ్ బీ రహదారుల కోసం దాదాపు రూ. 2,500 కోట్లు, పీఆర్‌ రోడ్ల కోసం సుమారు రూ.1072.92 కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.