యాప్నగరం

అమిత్ షాతో సీఎం జగన్: ఢిల్లీలో వీటిపైనే చర్చ.. కాకరేపుతున్న భేటీ!

YS Jagan Meets YS Jagan: కేంద్ర హోం అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ అంశాలపైనే వారు చర్చిస్తారని..!

Samayam Telugu 18 Jan 2021, 9:52 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ బయల్దేరనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సీఎం జగన్‌ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
Samayam Telugu అమిత్ షాతో సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


వీటితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులతో జగన్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో విగ్రహాల ధ్వంసంకు సంబంధించి పూర్తి నివేదికను కేంద్రానికి సీఎం జగన్ అందజేయనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీతో సమావేశం అవ్వాల్సి ఉండగా.. ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమంతో బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదు.

ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి సీఐడీ రిపోర్టును వారికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అంతర్వేది రథం దగ్ధం అంశంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో.. దీన్ని వెంటనే నియమించాలని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక విగ్రహాల ధ్వంసంకు సంబంధించి ఆ కుట్రలో దాగి ఉన్న ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతల వివరాలను కూడా కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.