యాప్నగరం

ఏపీ ప్రజలకు హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఉండే వారు జాగ్రత్త

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలను వివరిస్తూ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. జిల్లాలవారీగా ఏ,ఏ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలో వివరించింది.

Samayam Telugu 15 Apr 2020, 8:45 am
ఏపీ ప్రజల్ని స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అలర్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 13 వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వివరిస్తూ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. జిల్లాలవారీగా ఏ,ఏ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలో వివరించింది. అలాగే లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.
Samayam Telugu ap alert


నోడల్ ఆఫీసర్ అలర్ట్ చేసిన ప్రాంతాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం.. గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్.. అలాగే జిల్లాలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన.. కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయంటోంది.

కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్.. చిత్తూరు జిల్లా వడమాలపేట.. శ్రీకాళహస్తి ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం.. కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం.. అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని.. ఇక్కడి వారంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.