యాప్నగరం

ఏపీకి శుభవార్త: అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా కేసులు, మరణాలు

ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పడిపోయాయి. కరోనా మరణాలు ఐదు నమోదయ్యాయి.

Samayam Telugu 7 Dec 2020, 5:57 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ అత్యల్ప స్థాయికి పడిపోయాయి. అలాగే కరోనా మరణాల్లో సైతం భారీగా తగ్గిపోయాయి. అయితే డిశ్చార్జిల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 43,006 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 316 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,72,288కి చేరింది.
Samayam Telugu ఏపీ కరోనా కేసులు


అలాగే కరోనా మరణాలు కూడా భారీగా పడిపోయాయి. సోమవారం కరోనా బారిన పడి ఐదుగురు మంది మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కడపలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,038కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు స్వల్పంగా పడిపోయాయి. సోమవారం 595 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,59,624 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 5,626కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,53,618 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.