యాప్నగరం

ఏపీలో పడిపోయిన కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి

ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కరోనా మరణాలు 3 నమోదయ్యాయి.

Samayam Telugu 12 Dec 2020, 5:39 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పడిపోయాయి. అయితే కరోనా మరణాలు సైతం స్వల్పంగా పడిపోయాయి. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67,495 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 510 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,75,025కి చేరింది.
Samayam Telugu కరోనా వైద్యం


కరోనా మరణాల్లో శనివారం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. శుక్రవారం కరోనా బారిన పడి ఇద్దరు మరణించగా, శనివారం ఆ సంఖ్య మూడుకు పెరిగింది. కరోనా బారిన పడి గుంటూరు జిల్లాలో ఒకరు, వైఎస్సార్ కడపలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,052కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. శనివారం 665 మంది కోవిడ్‌ 19 బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,62,895 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 5,078కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,07,67,117 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.