యాప్నగరం

ఏపీలో 7 వేలు దాటిన కరోనా మరణాలు, పడిపోయిన యాక్టివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. వారం కరోనా మరణాలు 7 నమోదయ్యాయి.

Samayam Telugu 2 Dec 2020, 7:57 pm
ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పడిపోయాయి. అయితే కరోనా మరణాలు మళ్లీ పెరిగాయి. డిశ్చార్జిల సంఖ్య కూడా పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు పడిపోయింది. అలాగే కరోనా మరణాలు రాష్ట్రవ్యాప్తంగా 7 వేలు దాటాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 56,988 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 663 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,69,412కి చేరింది.
Samayam Telugu ఏపీ కరోనా కేసులు


అలాగే కరోనా మరణాలు కూడా స్వల్పంగా పెరిగాయి. బుధవారం కరోనా మహమ్మారి బారిన పడి ఏడుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,003కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. బుధవారం 1,159 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,55,485 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,924కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,01,66,698 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.