యాప్నగరం

ఏపీ ప్రజలకు ఊరట: కరోనా కేసుల కంటే పెరిగిన డిశ్చార్జిలు.. ఆందోళన కలిగిస్తున్న మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా, శనివారం 87 మంది మృతి చెందారు.

Samayam Telugu 15 Aug 2020, 6:21 pm
ఆంధ్రప్రదేశ్‌పై కరోనా వైరస్ ఉగ్రరూపం కొనసాగుతోంది. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా నమోదయ్యాయి. అయితే ఇందులో ఏపీ ప్రజలకు ఊరట కలిగించే విషయాన్ని వైద్య శాఖ వెల్లడించింది. శానివారం విడుదల చేసిన బులిటెన్‌లో కరోనా పాజిటివ్ కేసుల కంటే మహమ్మారిని జయించి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. శనివారం 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, డిశ్చార్జిలు 10 వేలు దాటాయి. అయితే మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 87 మరణాలు సంభవించగా, మొత్తం 2,500 దాటాయి. ఇక, గడిచిన 24 గంటల్లో 53,712 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8,732 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,81,817కు చేరింది.
Samayam Telugu ఏపీ కరోనా మరణం


Must Read: గోదావరిని ముంచెత్తుతున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. ఆందోళనలో ఆ ప్రాంత ప్రజలు

ఇక గడచిన 24 గంటల్లో ఏకంగా 87 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,562కు పెరిగింది. ఇక, కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 10 మంది, గుంటూరులో 9 మంది, తూర్పు గోదావరిలో 8 మంది, పశ్చిమ గోదావరిలో 8 మంది, అనంతపురంలో ఏడుగురు, కడపలో ఏడుగురు, కర్నూలులో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఇక, కరోనా నుంచి మంగళవారం 10,414 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 2,81,817 పాజిటివ్ కేసులకు గాను, 1,91,117 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 88,138 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read: అది తేలితే జగన్ సర్కార్ కూలిపోవడం ఖాయం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Also Read: వాళ్లు వలంటీర్లు కాదు, వారియర్స్.. సరిగ్గా ఏడాది క్రితం.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.