యాప్నగరం

ఏపీ ప్రజలకు శుభవార్త: సింగిల్ డిజిట్‌కు పడిపోయిన కరోనా మరణాలు

ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. అలాగే శనివారం కరోనా మరణాలు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి.

Samayam Telugu 14 Nov 2020, 6:52 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. అయితే ప్రజలకు ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. కరోనా కేసుల విజృంభణ మొదలైనప్పటి నుంచి మొట్టమొదటి సారిగా సింగిల్ డిజిట్‌కు మరణాలు పడిపోయాయి. ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు కావడం శుభపరిణామంగా చెప్పవచ్చు. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 79,823 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,657 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,52,955కి చేరింది.
Samayam Telugu ఏపీ కరోనా కేసులు


అలాగే కరోనా మరణాలు అత్యల్ప సంఖ్యలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి ఏడుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, చిత్తూరులో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, కర్నూలులో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,854కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు కూడా స్వల్పంగా తగ్గాయి. శనివారం 2,155 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,26,344 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 19,757 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 91,01,048 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.