యాప్నగరం

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. 20 వేలు దాటిన కేసులు.. ఒక్కరోజే 1,322.. మృతులు 239 ..

ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి. మొత్తం కరోనా కేసులు 20,019గా నమోదయ్యాయి.

Samayam Telugu 6 Jul 2020, 4:12 pm
ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీగా టెస్టులు చేస్తుండగా.. కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 1,322 కరోనా సోకడంతో మొత్తం కేసులు 20 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 16,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,263 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 56 మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి వైరస్ సోకింది. దీంతో సోమవారం ఒక్కరోజే మొత్తం కేసులు 1,322 నమోదయ్యాయి.
Samayam Telugu ఏపీ కరోనా వైరస్


అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 20,019కు పెరిగాయి. కరోనా వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, కృష్ణాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు చనిపోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 239కి చేరింది. గత 24 గంటల్లో 424 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,920 నమోదయ్యింది. మరో 10,860 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు

కర్నూలు జిల్లా -2,587
అనంతపురం జిల్లా -2,328
కృష్ణా జిల్లా - 1,798
గుంటూరు జిల్లా - 2,024
తూర్పుగోదావరి జిల్లా - 1,778
చిత్తూరు జిల్లా- 1,444
కడప జిల్లా - 1,341
పశ్చిమగోదావరి జిల్లా - 1,270
నెల్లూరు జిల్లా -730
ప్రకాశం జిల్లా - 738
విశాఖపట్నం జిల్లా - 822
విజయనగరం జిల్లా -239
శ్రీకాకుళం జిల్లా - 225
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు- 2,235
ఇతర దేశాల నుంచి వచ్చిన వారు- 419
మొత్తం కేసులు - 20,019

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.