యాప్నగరం

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ఏపీకి లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కరోనా మరణాలు 28 సంభవించాయి.

Samayam Telugu 20 Oct 2020, 7:06 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. కరోనా టెస్టుల సంఖ్య పెంచగా పాజిటివ్ కేసులు కూడా పెరిగాయి. కరోనా మరణాల్లో కూడా స్వల్పంగా పెరుగుదల నమోదైంది. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 69,095 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,503 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,89,553కు చేరుకున్నాయి.
Samayam Telugu కరోనా ఆస్పత్రి
corona hospital


అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కరోనా మరణాలు 28 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,481కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో నలుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

అలాగే డిశ్చార్జిలు రాష్ట్రంలో భారీగా పెరిగాయి. మంగళవారం 5,144 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,89,553 పాజిటివ్ కేసులకు గాను.. 7,49,676 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 33,396 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.