యాప్నగరం

ఏపీ ప్రజలకు శుభవార్త: అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా మరణాలు

ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కరోనా మరణాలు 4 నమోదయ్యాయి.

Samayam Telugu 5 Dec 2020, 6:04 pm
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పింది. శనివారం రాష్ట్రంలో అత్యల్ప స్థాయిలో కరోనా మరణాలు నమోదైనట్లు పేర్కొంది. ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగినా, మరణాలు కూడా భారీగా పడిపోయాయి. డిశ్చార్జిల సంఖ్య కూడా పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు పడిపోయింది. శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 57,132 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 630 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,71,305కి చేరింది.
Samayam Telugu కరోనా పరీక్షలు


అలాగే కరోనా మరణాలు కూడా భారీగా పడిపోయాయి. శనివారం కరోనా బారిన పడి నలుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,024కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు స్వల్పంగా పడిపోయాయి. శనివారం 882 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,58,115 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,166కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,50,283 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.