యాప్నగరం

ఏపీలో పడిపోయిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు

ఏపీలో కరోనా వైరస్ కేసులు పడిపోయాయి. అయితే కరోనా మరణాలు 3 నమోదయ్యాయి.

Samayam Telugu 2 Jan 2021, 5:57 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా పడిపోయాయి. అలాగే కరోనా మరణాలు మళ్లీ పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా తగ్గించగా, కేసుల్లో కూడా స్వల్పంగా తగ్గుదల నమోదైంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 48,518 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 238 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,82,850కి చేరింది.
Samayam Telugu కరోనా ఆస్పత్రి
corona hospital


ఇక, శుక్రవారం కరోనా మరణాలు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అయితే శనివారం కరోనా మరణాలు స్వల్పంగా పెరిగాయి. కరోనా మహమ్మారి బారిన పడి శనివారం ముగ్గురు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,111కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పడిపోయింది. శనివారం 279 మంది కోవిడ్‌ 19 బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,72,545 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,194కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,19,32,603 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.