యాప్నగరం

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు జగన్ సర్కార్ షాక్.. స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ట్విస్ట్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు.. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌లకు సిద్ధమైన నిమ్మగడ్డ. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చిన సీఎస్ నీలం సాహ్నీ.. నిమ్మగడ్డకు లేఖ.

Samayam Telugu 18 Nov 2020, 8:17 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం అన్ని జిల్లాల యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని.. పోలీసులు, జిల్లా యంత్రాంగం కరోనా వ్యప్తి అదుపు చేసే విధుల్లో ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదని.. గ్రామీణ ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నాయి అన్నారు. నేటి జిల్లా యంత్రాంగాలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదన్నారు. సీఎస్ రాసిన లేఖపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో చూడాలి.
Samayam Telugu నిమ్మగడ్డ రమేష్ కుమార్


Read Also: అచ్చెన్నను బాబు చీదరించుకున్నారు.. టీడీపీ ఆఫీస్‌లోకి రానివ్వడం లేదు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏపీలో కరోనా ఉధృతి కూడా తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి పడిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు.

Also Read: సీఎంవో నుంచి తప్పుకున్న జగన్ సలహాదారు.. 18 రోజుల తర్వాత ఆసక్తికర ట్వీట్

తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని ఎస్ఈసీ అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, ఎలక్షన్స్‌కు 4 వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత వెలువరిస్తామన్నారు. ఇటు నేడు గవర్నర్ హరిచందన్‌తోనూ నిమ్మగడ్డ భేటీకానున్నారు. ఎన్నికల అంశంపై చర్చించనున్నారు.

Must Read: స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కొత్త మెలిక.. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.