యాప్నగరం

Pawan Kalyan అంటే ఎవరో నాకు తెలియదు: ఏపీ ఉప ముఖ్యమంత్రి

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి జనసేనాని పవన్‌ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు త్వరలోనే పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడుస్తారని జోస్యం చెప్పారు. అది తెలియక.. పవన్ కళ్యాణ్ చంద్రబాబును నమ్ముకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి పిచ్చోళ్లతో తమకేం సంబంధం అని ప్రశ్నించారు. ఏ కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లదని స్పష్టం చేశారు. దానికి ఎవరికీ బాధ అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 4 Dec 2022, 5:45 pm

ప్రధానాంశాలు:

  • ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక కామెంట్స్
  • పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తనకు తెలియదని వ్యాఖ్య
  • పవన్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారని జోస్యం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pawan vs Narayana Swamy
పవన్ వర్సెస్ నారాయణ స్వామి
Pawan Kalyan: ఆంధ్రా రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 'పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలియదు. అతను ఒక డ్రామా యాక్టర్‌గా, ఒక ఫైటర్‌గా మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే.. తిరుపతి నుంచి ఎగిరి నెల్లూరులో దూకే సినిమాలు తీస్తారు. ఆయన గ్రాఫిక్స్ సినిమాల్లో నటిస్తారు. అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో కూడా అతనికి తెలియదు. పాపం అతన్ని తీసుకొచ్చి చంద్రబాబు వాడుకున్నారు'. అని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.
'చంద్రబాబు త్వరలోనే పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడుస్తారు. అది తెలియక.. పవన్ కళ్యాణ్ చంద్రబాబును నమ్ముకొని తిరుగుతున్నారు. అందుకే ప్రజలు ఆయన్ను నమ్మడం లేదు. అసలు పవన్ కళ్యాణ్‌కు రాజకీయమే తెలియదు. ఒకరోజు చెప్పు చూపిస్తాడు.. ఒక రోజు కాలు చూపిస్తాడు.. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడే పిచ్చోళ్లతో నాకే పని' అని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక కామెంట్స్ చేశారు. అంతేకాదు.. కంపెనీల గురించి మాట్లాడారు. 'బ్యాటరీల కంపెనీని మేము ఇక్కడి నుంచి పంపించలేదు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది వారి ఇష్టం. దాంతో మాకేంటి సంబంధం. ఈ రాష్ట్రం నుంచి ఒక్క కంపెనీ కూడా ఎక్కడికీ పోదు. ఎవ్వరు ఏం బాధ పడాల్సిన అవసరం లేదు' అని నారాయణ స్వామి స్పష్టం చేశారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.