యాప్నగరం

‘రాజధాని మార్పు అవాస్తవం.. స్వార్థం కోసమే తప్పుడు ప్రచారం’

సేద్యానికి భూముల్లేక, రాజధానిలో పనుల్లేక ఇబ్బంది పడుతున్నామని, మంత్రి బొత్స వ్యాఖ్యలతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నామంటూ అమరావతి ప్రాంత రైతులు వాపోతున్నారు.

Samayam Telugu 1 Sep 2019, 11:17 am
రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వరుస వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌లో రేగిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాజధాని నిర్మాణ వ్యయం అధికమవుతుందని ఒకసారి, అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని ఇంకోసారి బొత్స చేసిన వ్యాఖ్యలు అటు భూములిచ్చిన రైతులు మండిపడుతున్నారు. మరోవైపు, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రాజధానిని తరలించడమంటే శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని వ్యతిరేకించడమేనని, అమిత్‌షా మాటను కాదనడమేనంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ దుయ్యబడుతున్నారు. ఎంతకూ భవనాలు కూలగొడదాం. ధ్వంసం చేద్దామనే ఆలోచనే తప్ప ఏం నిర్మిద్దామని ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు అంశంపై డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రి అంజద్ బాషా స్పందించారు.
Samayam Telugu amjad-basha-800x500


కడప జిల్లాలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని మార్పు ఉండదని స్పష్టం చేశారు. కొందరు నేతలు కేవలం తమ స్వార్థం కోసమే రాజధాని మార్పు అంశంపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి రాజధానిపై ఎలాంటి మార్పు లేదంటూ ఒకే మాటపై ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇలాగే బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. జగన్‌ సీఎం అయితే రాజధానిని కడపకు తీసుకెళ్తారని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. అప్పట్లోనే రాజధాని మార్పుపై తమ అధినేత స్పష్టత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నవ్యాంధ్రలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యమని బాషా పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.