యాప్నగరం

వాళ్లంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చంద్రబాబు బినామీలు.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతి రాజధాని రైతులపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 23 Aug 2020, 4:41 pm
తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే అమరావతి రైతులపై అంజాద్ బాషా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu అంజద్ బాషా


అమరావతిలో అసలు రైతుల ఉద్యమమే లేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని, వారంతా చంద్రబాబు కోసం పని చేస్తున్న ఆయన బినామీలేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు డ్రామానే నడుస్తోందని, అదంతా కృత్రిమ ఉద్యమమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మతి స్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు.

అలాగే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి చేసుకుందన్నారు. 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలన్న తలంపుతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఐదేళ్లలో ఒక్క నిరుపేదకు కూడా గత టీడీపీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన సందర్భం లేదని విమర్శించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధానికి చంద్రబాబు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని అంజాద్‌ బాషా మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.