యాప్నగరం

ఢిల్లీ వెళ్లొచ్చిన 85 మంది ఆచూకీ లేదు.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన

Delhi Nizamuddin Dargah: ఏపీ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 85 మంది ఆచూకీ తెలియలేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు.

Samayam Telugu 31 Mar 2020, 8:12 pm
ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్‌ ప్రార్థనల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 711 మంది పాల్గొన్నారని రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా ప్రార్థనల్లో పాల్గొనగా, ఏపీ నుంచి 700 మందికి పైగా అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. ఆ ప్రార్థనల్లో సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే అక్కడికి వెళ్లిన వారికి కరోనా వైరస్‌ సోకిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం మంత్రి అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అనేక మంది ప్రార్థనల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు.
Samayam Telugu Amjad-Basha


అయితే ఢిల్లీ వెళ్లిన దాదాపు అందరికీ రక్త పరీక్షలు జరిపి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు మంత్రి తెలిపారు. అయితే వీరిలో ఇంకా 85 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రార్థనలకు వెళ్లిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, వారు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే అధికారులు నేరుగా వచ్చి పరీక్షలు చేస్తారని సూచించారు.

అలాగే వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా 138 మంది శాంపిల్స్‌ పరీక్షలకు పంపగా, 65 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని మంత్రి అంజాద్ బాషా వెల్లడించారు. ప్రొద్దుటూరులో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన ఏడుగురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా ద్వారా సమాచారం ఢిల్లీ వెళ్లిన వారికి అందేలా చూడాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.