యాప్నగరం

YSRCP ఎంపీపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

తమ అధినేత వైఎస్‌ జగన్ కాళ్లు పట్టుకుని ఎంపీ టికెట్‌ తీసుకున్నారని.. అంతకముందు ఆయన ఎవరో కూడా జనాలకు తెలియదు అన్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తుతో ఎంపీగా గెలిచిన ఆయన రాజీనామా చేయాలన్నారు,.

Samayam Telugu 15 Aug 2020, 6:32 am
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఎంపీకి కౌంటర్ ఇచ్చారు. రఘురామ తమ అధినేత వైఎస్‌ జగన్ కాళ్లు పట్టుకుని ఎంపీ టికెట్‌ తీసుకున్నారని.. అంతకముందు ఆయన ఎవరో కూడా జనాలకు తెలియదు అన్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తుతో ఎంపీగా గెలిచిన ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలన్నారు. తమ ప్రభుత్వానికి దళితులను దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు నారాయణ స్వామి.
Samayam Telugu నారాయణ స్వామి


రఘురామ కొద్ది రోజులుగా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు. అమరావతి సహా అన్ని అంశాలపై ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాను ప్రజామోదంతో గెలిచానని.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. అమరావతి అక్కడే ఉంటుందంటూ అబద్దాలు ఆడారు.. గూబ పగిలిపోతుంది అంటూ విరుచుకుపడ్డారు. తన విజయంలో జగన్ 90 శాతం కారణమైతే.. తన బొమ్మతో కూడా తాను నెగ్గాను అన్నారు ఎంపీ. రోజూ వందల కాల్స్ వస్తాయి. రాజీనామా.. రాజీనామా అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడు అన్నారు. తనలాగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వాలని.. లేకపోతే ఏం మాట్లాడకుండా కూర్చోవాలన్నారు. అనవసరంగా తనను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.