యాప్నగరం

దళితులంటే ఎందుకంత చులకన? డిప్యూటీ సీఎం ఫైర్

టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు పెట్టించారు. ఇప్పుడు దళిత ఎస్సైని దూషించడం దారుణం. బాధ్యతాయుతమైన పదవి నిర్వహించిన ఓ మహిళ అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 12 Sep 2019, 3:55 pm
టీడీపీ నేతలది అగ్రకుల దురహంకారమని ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. దళిత మహిళా ఎస్సైని కులం పేరుతో దూషించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానించారని గుర్తు చేశారు. మరో నేత ఆదినారాయణ రెడ్డి దళితులను కించపరిచేలా వ్యాఖ్యానించారన్నారు.
Samayam Telugu Pamula-Pushpa-Srivani


మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఎన్నికల్లో చిత్తుగా ఓడినా టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌‌గా పనిచేసిన నన్నపనేని దళిత ఎస్సై అనురాధపై దుర్భాషలాడడం దారుణమన్నారు. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు నన్నపనేని దళితులను కించపరుస్తూ మాట్లాడారన్నారు. టీడీపీ నేతలకు దళితులపై వివక్షతగదని హితవు పలికారు. ఎస్సై ఫిర్యాదు మేరకు పోలీసులు నన్నపనేని రాజకుమారిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Must Read :పల్నాడులో రాజకీయ హత్య.! కత్తులతో దారుణంగా నరికి..

చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసు వాహనం ఎక్కించే సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సందర్భంలో ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ నన్నపనేని దూషించారని ఆరోపణలు వచ్చాయి. సదరు దళిత ఎస్సై ఫిర్యాదుతో కేసు కూడా నమోదైంది.

ఈ విషయంపై నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ ఎస్సై కులమేంటో తనకు తెలియదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. దళితులకు న్యాయం చేయడమే వచ్చు కానీ దూషించడం రాదని ఆమె అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.