యాప్నగరం

'Nara Bhuvaneswari ఇవ్వాల్సింది గాజులు కాదు.. కొట్టేసిన భూములు'

జనవరి 1న అమరావతిలో పర్యటించిన చంద్రబాబు దంపతులు. రాజధాని రైతుల పోరాటానికి విరాళంగా తన బంగారు గాజుల్ని ఇచ్చిన నారా భువనేశ్వరి. భువనేశ్వరి అమరావతి పర్యటనపై హాట్ కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాని.

Samayam Telugu 2 Jan 2020, 8:27 am
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన సతీమణి నారా భువనేశ్వరిపై విరుచుకుపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో అమరావతి ఉద్యమానికి విరాళంగా గాజులిప్పించారని.. రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో చౌకగా కొట్టేసిన రైతుల భూములను తిరిగివ్వాలి అన్నారు.
Samayam Telugu babu.


Read Also: అమరావతిపై సీఎం జగన్ సంచలన నిర్ణయం?

హెరిటేజ్ కంపెనీ పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో తీసుకున్న 14.22 ఎకరాల భూమిని చౌకగా కొట్టేశారని ఆరోపించారు. ఆ భూమిని రైతులకు ఇచ్చేయాలని.. భువనేశ్వరి ఇచ్చే గాజులకన్నా.. ఆ రైతుకు కలిగిన నష్టం వందల రెట్లు పెద్దది అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇంట్లోంచి బయటకు రాని భువనేశ్వరి ఇప్పుడు తమ భూముల కోసం బయటకు వచ్చారంటే ఆమెకు వ్యాపార, స్వప్రయోజనాలే ఎక్కువన్నారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిలో టీడీపీ నేతలు 4 వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా అని ప్రశ్నించారు పుష్ప శ్రీవాణి. రాజధానిలో చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయనే అమరావతిలో మరో డ్రామా మొదలు పెట్టారని ఆరోపించారు. అమరావతి గ్రామాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులకు చంద్రబాబు కారణమని.. గ్రాఫిక్స్ మాయంతో రైతులు, ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు.

చంద్రబాబు అమరావతిలో రైతుల కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చారన్నారు డిప్యూటీ సీఎం. ఐదేళ్లలో రాజధాని ఎందుకు కట్టలేకపోయారని.. తమ భూములను అభివృద్ధి చేసి ఎందుకివ్వలేదని రాజధాని గ్రామాల ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేదన్నారు. టీడీపీ నేతలు కొట్టేసిన 4,069 ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.