యాప్నగరం

విజయవాడ: హలో హ్యాపీ జర్నీ.. ప్రయాణికులకు డీజీపీ ఆత్మీయ పలకరింపు

విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వె స్టేషన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు ఈ శ్రామిక రైలు బయల్దేరింది. లాక్ డౌన్‌తో రాష్ట్రంలో చిక్కుకుపోయిన అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్టాలకు చెందిన వారిని ఈ శ్రామిక్‌ రైలు ద్వారా తరలించారు.

Samayam Telugu 18 May 2020, 7:50 am
విజయవాడ నుంచి వెళ్లిన శ్రామిక్ రైలును డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఆదివారం రాత్రి డీజీపీ, కలెక్టర్‌తో కలిసి గ్రీన్ సిగ్నల్ లైట్‌‌తో రైలు ముందుకు కదిలింది. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వె స్టేషన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు ఈ శ్రామిక రైలు బయల్దేరింది. లాక్ డౌన్‌తో రాష్ట్రంలో చిక్కుకుపోయిన అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్టాలకు చెందిన వారిని ఈ శ్రామిక్‌ రైలు ద్వారా తరలించారు.
Samayam Telugu డీజీపీ సవాంగ్


డీజీపీ సవాంగ్ సొంత రాష్ట్రాలకు వెళుతున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. హలో హ్యాపీ జర్నీ.. సొంత ఊళ్లకు వెళుతున్నందుకు సంతోషమే కదా అంటూ రైలు సౌకర్యంగా ఉందా.. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మళ్లీ ఆనందంగా తిరిగి రావాలి అన్నారు. లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన శ్రామికులను తరలించడం, ఏపీకి రప్పించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు డీజీపీ. ఇప్పటివరకు 31 శ్రామిక రైళ్లను ఏర్పాటు చేశామని.. మరో 22 రైళ్లు నడిపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు సవాంగ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.