యాప్నగరం

ఏబీ వెంకటేశ్వరరావుకు షాకిచ్చిన ఏపీ పోలీసులు.. వివేకా హత్య కేసులో సంచలనం!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై ఏపీ పోలీసులు రియాక్ట్ అయ్యారు.

Samayam Telugu 18 Apr 2021, 4:38 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంటెలిజెన్స్ మాజీ‌ చీఫ్ ఏబీ‌ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని రాష్ట్ర డీఐజీ పాల్ రాజు తేల్చి చెప్పారు. డీజీపీ, ఇతర పోలీసు అధికారులపై ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై ఆయన స్పందించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఏబీవీ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
Samayam Telugu సీఎం జగన్‌తో వైఎస్ వివేకానందరెడ్డి (ఫైల్ ఫొటో)


ఈ మేరకు ఆదివారం డీఐజీ పాల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య జరిగిన అనంతరం కూడా వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గానే కొనసాగారని వివరించారు. అప్పుడు ఆ కేసుకు సంబంధించిన కీలక సమాచారం సిట్‌కు ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. కేసు విషయంలో ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి తప్ప.. సహచర ఉద్యోగులపై ఇలా ఆరోపణలు చేయడం తగదని పాలరాజు హితవు పలికారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు వెలికితీయకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేశారని పాల్ రాజ్ మండిపడ్డారు. సిట్ దర్యాప్తుపై ఏబీవీ సందేహాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని తెలిపారు. ఏబీవీ దగ్గర ఆధారాలు ఉంటే సీబీఐకి సీల్డ్‌కవర్‌లో లేఖ పంపొచ్చని చెప్పారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్‌రాజ్‌ ప్రశ్నించారు. బహిరంగ విమర్శలు చేయడం తీవ్రమైన విషయమని అన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకమని గుర్తుచేశారు. ఏబీవీకి అనుమానాలుంటే పద్ధతి ప్రకారం సమాచారం ఇవ్వాలని డీఐజీ పాల్‌రాజ్‌ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.