యాప్నగరం

సీఎం జగన్ ఫ్యామిలీని అరెస్టు చేయాలని ఒత్తిళ్లు, అంతా ఆయన కనుసన్నల్లోనే.. డీఐజీ సంచలనం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధులను అరెస్టు చేయాలని అప్పట్లో ఒత్తిళ్లు వచ్చాయని డీఐజీ ఆరోపించారు.

Samayam Telugu 18 Apr 2021, 11:29 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి ఇంటెలిజెన్స్ మాజీ‌ చీఫ్ ఏబీ‌ వెంకటేశ్వరరావు (ఏబీవీ) రాసిన లేఖపై పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర డీఐజీ పాలరాజు సంచలన విషయాలు వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం ఆధారాలు లేకున్నా అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులను అరెస్టు చేయాలని దర్యాప్తు అధికారి రాహుల్ దేవ్‌పై ఏబీవీ ఒత్తిడి తీసుకొచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నిబద్దత గల అధికారి కాబట్టి ఏబీవీ ఒత్తిళ్లకు తలొగ్గలేదని డీఐజీ చెప్పుకొచ్చారు.
Samayam Telugu సీఎం జగన్ ఫ్యామిలీపై డీఐజీ సంచలన ప్రెస్మీట్

నాడు ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే వైఎస్ వివేకా హత్య దర్యాప్తు జరిగిందని డీఐజీ పాలరాజు సంచలన విషయాలు బయటపెట్టారు. ఏబీవీ ఇచ్చిన సమాచారంతోనే నాడు చంద్రబాబు మీడియాతో మాట్లాడేవారని చెప్పుకొచ్చారు. వివేకా హత్య జరిగినప్పటి నుంచి వాస్తవాలను బయటకు తీసేవిషయాన్ని బయటపెట్టి.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ను, ఇతర విభాగాలను ఒత్తిడికి గురి చేశారని సంచలన విషయాలు చెప్పారు. అధికారులపై ఈ విధంగా ఒత్తిడి చేసిన మాట వాస్తవమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే ఏబీవీ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలను.. మీడియాకు వెల్లడించడం సమంజసం కాదని, కృత్రిమ డాక్యమెంట్లు సృష్టించారన్న ఏబీ ఆరోపణలు నిరాధారమని డీఐజీ వివరించారు. సహచర అధికారులపై ఏబీ ఆరోపణలు సరికాదని డీఐజీ వ్యాఖ్యానించారు.

ఇక, సీబీఐకి లేఖ రాసిన ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన అఖిల భారత సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా ఇతర అధికారులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. అలాగే గోప్యంగా ఉంచాల్సిన అధికారిక సమాచారాన్ని కూడా బహిర్గతం చేశారని పేర్కొంది. దీనిపై 30 రోజుల్లోపు వ్యక్తిగతంగా హజరవడంతో పాటు,లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుని ఆదేశించింది. ఒకవేళ సరైన వివరణ ఇ‍వ్వనట్లైతే, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.