యాప్నగరం

మరో 12 గంటలు కీలకం, ఆ జిల్లాలపై ఎఫెక్ట్.. ఏపీ విపత్తుల శాఖ హెచ్చరిక

నివర్ తుఫాన్ ముప్పు ఇంకా తొలగిపోలేదంటోంది విపత్తుల శాఖ. నివర్ తుఫాన్ రాగల 6 గంటల్లో తీవ్రవాయుగుండం, ఆ తర్వాత 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడనుంది.

Samayam Telugu 26 Nov 2020, 3:00 pm
ఏపీపై నివర్ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తీరం దాటిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే నివర్ తుఫాన్ ముప్పు ఇంకా తొలగిపోలేదంటోంది విపత్తుల శాఖ. నివర్ తుఫాన్ రాగల 6 గంటల్లో తీవ్రవాయుగుండం, ఆ తర్వాత 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడనుంది. తీరం దాటినా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
Samayam Telugu మరో 12 గంటలు కీలకం


నివర్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు.
చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని.. ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి అంటున్నారు. నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.