యాప్నగరం

ఏపీ: 3 జిల్లాల్లో పిడుగులు పడే చాన్స్.. 22 మండలాల ప్రజలకు హెచ్చరికలు

ఏపీలో మూడు జిల్లాల్లోని 22 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు హెచ్చరించారు.

Samayam Telugu 29 May 2020, 6:05 pm
రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని శుక్రవారం రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు హెచ్చరించారు. ఉపరితల ద్రోణి కారణంగా శుక్రవారం నంచి వర్షాలు కురిసే మూడు జిల్లాల్లోని పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Samayam Telugu పిడుగులు


కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపురులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కమిషనర్‌ కన్నబాబు సూచించారు. మూడు జిల్లాల్లోని మొత్తం 22 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఇళ్లలో సురక్షితంగా ఉండాలన్నారు.

పిడుగులు పడే చాన్స్ ఉన్న మండలాలివే..
శ్రీకాకుళం జిల్లా:
సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం విజయనగరం జిల్లా:
కురుపాం, గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, వేపాడ, సీతానగరం.
విశాఖపట్నం జిల్లా:
హుకుంపేట, అనంతగిరి, అరకులోయ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.