యాప్నగరం

ఏపీలో పిడుగులు పడే చాన్స్.. ఈ 29 మండలాల ప్రజలకు తీవ్ర హెచ్చరికలు

ఏపీలో 4 జిల్లాల్లోని 29 మండలాల ప్రజల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Samayam Telugu 1 Sep 2020, 4:24 pm
ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ, రాయలసీమ జిల్లాల్లో మంగళవారం జోరు వర్షం కురిసింది. ఏపీలో నాలుగు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ 4 జిల్లాల పరిధిలోని 29 మండలాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. ప్రజలంతా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి.
Samayam Telugu పిడుగులు


పిడిగుల పడే అవకాశం ఉన్న మండలాలు..
ప్రకాశం జిల్లా:
ఒంగోలు, పామూరు, కనిగిరి, గుడ్లూరు, పెదచెర్లోపల్లె, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కొండపి, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, గిద్దలూరు.

నెల్లూరు జిల్లా:
వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం, కలిగిరి, దగదర్తి, బోగోల్, జలదంకి, హనుమసముద్రంపేట, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కావలి.

కడప జిల్లా:
శ్రీఅవదూతకాశినయన, కలసపాడు.

కర్నూలు జిల్లా: ఆత్మకూరు, కొత్తపల్లి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.