యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్: మండుతున్న ఎండలు.. ఈ 116 మండలాల్లో వడగాడ్పులు!

ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం పెద్ద ఎత్తున వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 17 Apr 2023, 1:58 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం 116 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 61 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వడగాడ్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జిల్లాల వారీగా.. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలివే!
అల్లూరి జిల్లా: 7
అనకాపల్లి: 15
తూర్పు గోదావరి: 8
ఏలూరు: 4
గుంటూరు: 6
కాకినాడ: 9
కృష్ణా: 6
నంద్యాల: 4
ఎన్టీఆర్: 15
పల్నాడు: 2
పార్వతీపురం మన్యం: 10
శ్రీకాకుళం: 3
విశాఖపట్నం: 1
విజయనగరం: 13, వైఎస్సార్ జిల్లాలోని 13 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరోవైపు, ఆదివారం సైతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగ్గుమన్నాయి. అనకాపల్లి జిల్లాలో 11 మండలాలు, కాకినాడ జిల్లాలో 3 మండలాలు, విజయనగరం జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.