యాప్నగరం

ఏపీలో 3 జిల్లాల్లో పిడుగులు పడే చాన్స్.. ఈ మండలాల ప్రజలకు తీవ్ర హెచ్చరికలు

ఏపీలోని మూడు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Samayam Telugu 30 Jun 2020, 2:37 pm
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
Samayam Telugu పిడుగులు


పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు- గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.

పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలివే..
కృష్ణా జిల్లా:
గూడూరు, మొవ్వ, ఘంటశాల, మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, పామర్రు, తోట్లవల్లూరు.
గుంటూరు జిల్లా:
గుంటూరు, తెనాలి, కొల్లూరు, రేపల్లె, బాపట్ల, కొల్లిపర, తుళ్ళూరు, ఇపూర్, నర్సారావుపేట, చిలకలూరిపేట.
ప్రకాశం జిల్లా: ఇంకొల్లు, మార్టూర్, యద్దనపూడి, జనకవరం పంగులూరు, అద్దంకి, ముండ్లమూరు, పర్చూరు, చినగంజాం, సింగరాయకొండ, టంగుటూరు, కొరిశపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.