యాప్నగరం

ఏపీలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లోనే దళిత యువకుడికి శిరోముండనం..

ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడికి పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారు.

Samayam Telugu 21 Jul 2020, 4:27 pm
తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లోనే దళిత యువకుడికి గాయాలయ్యేలా కొట్టి, శిరోముండనం చేశారు. జిల్లాలోని సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో ఈ ఘోరం జరిగింది. ఇసుక లారీలు అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక ముని కూడలి వద్ద అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు పేర్కొన్నారు.
Samayam Telugu దళిత యువకుడికి శిరోముండనం


దీనిపై ప్రశ్నించినందుకు తిరిగి తనపైనే వైసీపీ నాయకుడి అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని బాధితుడు తెలిపారు. దీంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని వాపోయారు. అనంతరం తనను సీతానగరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి తీవ్రంగా కొట్టి శిరోముండనం చేశారని ఆరోపించారు.

కాగా, గాయపడ్డ బాధితుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెదుళ్ల పల్లిలోని బాధితుడు వరప్రసాద్‌ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. సీతానగరంలో ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.