యాప్నగరం

YS Jagan అదిరిపోయే శుభవార్త: ఈసారి 80 లక్షల మంది అకౌంట్లలో రూ. 15 వేలు జమ!

ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఏడాది ఎంత మందికి జగనన్న అమ్మ ఒడి పథకం పథకం వర్తిస్తుందో చెప్పారు.

Samayam Telugu 21 Dec 2020, 9:46 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుభవార్త చెప్పారు. జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి సురేష్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం వర్తించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ. 6,300 కోట్లు జమ చేసినట్లు మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఈ సారి దాదాపు రెండు రెట్లు అధికంగా లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నారు.
Samayam Telugu సీఎం జగన్


ఇక, రేషన్ కార్డులు, అమ్మ ఒడి తొలగిస్తున్నామని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ కొట్టిపారేశారు. ఎన్ని లక్షల మంది అర్హులు ఉన్నా అందరికీ పథకాలను అందిస్తామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు ఈ అమ్మ ఒడి పధకం వర్తిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థులకు ఏడాదికి విడతల వారిగా రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్ధాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.