యాప్నగరం

ఎన్నికల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్‌లు.. రిజర్వులో ఆ నలుగురు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులుగా 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

Samayam Telugu 9 Mar 2020, 5:05 pm
రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకులుగా 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు మరో నలుగురు ఉన్నతాధికారులను రిజర్వ్‌లో ఉంచారు.
Samayam Telugu Ap-elections


ఎన్నికల పరిశీలకులుగా.. కర్నూలు జిల్లాకు కేఆర్‌బీహెచ్ఎన్ చక్రవర్తి, కృష్ణ జిల్లాకు ఎం. పద్మ, తూర్పు గోదావరి జిల్లాకు పి.ఉషా కుమారి, విజయనగరం జిల్లా పీఏ శోభా, అనంతపురం- కె. హర్షవర్ధన్, చిత్తూరు- టి. బాబు రావు నాయుడు, శ్రీకాకుళం- ఎం.రామారావు, ప్రకాశం- కె. శారదా దేవి, విశాఖపట్నం జిల్లా - ప్రవీణ్‌ కుమార్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు- బి. రామారావు, వైఎస్సార్ కడప- పి. రంజిత్ బాషా, గుంటూరు- కాంతిలాల్ దండే, పశ్చిమ గోదావరి జిల్లాకు హిమాన్షు శుక్లాను నియమించారు.

Also Read: బీసీలకు సీఎం జగన్ వరం.. టీడీపీకి దిమ్మతిరిగేలా..

వీరికి అదనంగా నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు సీహెచ్ శ్రీధర్, జి. రేఖారాణి, టీకే రామమణి, ఎన్.ప్రభాకరరెడ్డిలను రిజర్వులో ఉంచారు.

రాష్ట్రంలో మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలను ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 27న పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. 29న రెండో విడదత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 660 జడ్పీ, 9,639 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: చిరంజీవి లేకపోతే ఆత్మహత్యే గతి.. వాళ్లు చెప్పుతో కొట్టి పంపారు.. పృథ్వీరాజ్ షాకింగ్ వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.