యాప్నగరం

ఏపీ ఆలయాల్లో స్వరూపానంద స్వామి జన్మదిన వేడుకలు.. జగన్ సర్కారు సంచలన ఆదేశాలు

ఏపీలో ఈ నెల 18న ఏపీలోని పలు దేవాలయాల్లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం జరగనుంది.

Samayam Telugu 13 Nov 2020, 10:34 pm
విశాఖపట్నం శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదిన వేడుకల్ని జరపాలంటూ పలు దేవాలయాలకు ఏపీ దేవాదాయశాఖ మెమో జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో సీఎం జగన్


శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానం ఈవోలకు ఆయన మెమో పంపారు. ఈ నెల 9న విశాఖ శారదా పీఠం మేనేజర్‌ లేఖ రాసిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయా దేవాలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వరూపానందేంద్ర స్వామి జన్మదినాన్ని దేవాలయాల్లో జరపాలని ఆదేశించడంపై చర్చనీయాంశమైంది. ఇటీవలే స్వరూపానంద స్వామి, శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్రలకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలికాడంపై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నుంచి ప్రభుత్వం బయటపడకముందే తాజాగా, స్వరూపానంద విషయంలో మరో ఆదేశాలు చేసింది. కాగా, గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వరూపానందేంద్ర సరస్వతి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అలాగే సీఎం జగన్ కోసం ఆయన ప్రత్యేక పూజలు, హోమాలు సైతం నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.