మద్యపాన నిషేధంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. దశలవారిగా మద్యపాన నిషేధం అమలుచేయనుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూపోతుంది. అంతేకాదు, ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించి, అమ్మకాలను సాగించనుంది. దీనికి సంబంధించి ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ సైతం జారీచేసింది. తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి కే నారాయణస్వామి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మద్యపాన నిషేధంపై మహిళలకు పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం విజయవంతం కావాలంటే మహిళలు ముందుకు రావాలని ఆయన సూచించారు. మద్య నిషేధం అమలు కోసం అప్పట్లో మహా ఉద్యమాన్నే నడిపిన చరిత్ర రాష్ట్ర మహిళలకు ఉందని మంత్రి గుర్తుచేశారు. Read Also: ఆందోళనలో అమరావతి రైతాంగం.. రాజధాని మార్చొద్దంటూ జగన్ సర్కారుపై పోరాటానికి సై!
ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న దశలవారీ మద్య నిషేధం విజయవంతానికి అదే స్ఫూర్తితో మహిళలు కదలిరావాలన్నారు. మద్యపానంతో ఆర్థికంగా, సామాజికంగా ఛిన్నాభిన్నమైపోతుంటే మహిళలే బాధితులుగా మిగులుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పాదయాత్రలో మహిళల కష్టాలను దగ్గర్నుంచి చూసిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీ మద్య నిషేధాన్ని ప్రకటించారని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమయ్యేందుకు సహకరించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందులోనూ ముఖ్యంగా మహిళల పాత్ర కీలకమని, గ్రామ వాలంటీర్ల సేవలనూ ఇందుకు వినియోగించుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: మాట నిలబెట్టుకున్న జగన్.. కొత్తగా మరో మూడు కార్పొరేషన్లు
మద్యపాన నిషేధంపై అప్పట్లో నెల్లూరులో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందన్నారు. నాటి సీఎం ఎన్టీఆర్ కొన్ని నెలలపాటు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే, మద్యం ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు ఎలా సాధ్యమంటూ ఆ తర్వాత చంద్రబాబు దానిని నీరుగార్చారన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తూ.. వారికి చికిత్సకు అవసరమైన పథకాల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేయడంవల్ల ప్రయోజనమేంటి? అని ఆయన ప్రశ్నించారు.
Read Also:YS Jagan మొండి, అనుకున్నది చేస్తారు.. కేసీఆర్తో జాగ్రత్త: ఎంపీ టీజీ ఆసక్తికర వ్యాఖ్యలు
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి మద్య నిషేధం అమలుచేస్తే కొన్ని సమస్యలు ఎదురువుతాయనే దశలవారీగా చేపడుతున్నామని మంత్రి వివరించారు. అందుకే ప్రస్తుతం ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 3,500కు తగ్గించామని, ఏటా 20-25 శాతం తగ్గించుకుంటూ వెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024 నాటికి అసలు మద్యం దుకాణాల ఊసే లేకుండా చేస్తామని, కేవలం స్టార్ హోటళ్లకే వీటిని పరిమితం చేస్తామన్నారు.
మద్యానికి బానిసులుగా మారిన వ్యక్తులను అందులో నుంచి బయటపడేసేందుకు జిల్లాకి ఒకటి చొప్పున డీ అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసి, వీటి సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతామన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులను నిర్వహించి, మేధావులతో కమిటీ ఏర్పాటు చేసి మద్యంతో కలిగే అనర్థాలను ప్రచారం చేస్తామన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న దశలవారీ మద్య నిషేధం విజయవంతానికి అదే స్ఫూర్తితో మహిళలు కదలిరావాలన్నారు. మద్యపానంతో ఆర్థికంగా, సామాజికంగా ఛిన్నాభిన్నమైపోతుంటే మహిళలే బాధితులుగా మిగులుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పాదయాత్రలో మహిళల కష్టాలను దగ్గర్నుంచి చూసిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీ మద్య నిషేధాన్ని ప్రకటించారని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమయ్యేందుకు సహకరించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందులోనూ ముఖ్యంగా మహిళల పాత్ర కీలకమని, గ్రామ వాలంటీర్ల సేవలనూ ఇందుకు వినియోగించుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: మాట నిలబెట్టుకున్న జగన్.. కొత్తగా మరో మూడు కార్పొరేషన్లు
మద్యపాన నిషేధంపై అప్పట్లో నెల్లూరులో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందన్నారు. నాటి సీఎం ఎన్టీఆర్ కొన్ని నెలలపాటు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే, మద్యం ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు ఎలా సాధ్యమంటూ ఆ తర్వాత చంద్రబాబు దానిని నీరుగార్చారన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తూ.. వారికి చికిత్సకు అవసరమైన పథకాల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేయడంవల్ల ప్రయోజనమేంటి? అని ఆయన ప్రశ్నించారు.
Read Also:YS Jagan మొండి, అనుకున్నది చేస్తారు.. కేసీఆర్తో జాగ్రత్త: ఎంపీ టీజీ ఆసక్తికర వ్యాఖ్యలు
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి మద్య నిషేధం అమలుచేస్తే కొన్ని సమస్యలు ఎదురువుతాయనే దశలవారీగా చేపడుతున్నామని మంత్రి వివరించారు. అందుకే ప్రస్తుతం ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 3,500కు తగ్గించామని, ఏటా 20-25 శాతం తగ్గించుకుంటూ వెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024 నాటికి అసలు మద్యం దుకాణాల ఊసే లేకుండా చేస్తామని, కేవలం స్టార్ హోటళ్లకే వీటిని పరిమితం చేస్తామన్నారు.
మద్యానికి బానిసులుగా మారిన వ్యక్తులను అందులో నుంచి బయటపడేసేందుకు జిల్లాకి ఒకటి చొప్పున డీ అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసి, వీటి సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతామన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులను నిర్వహించి, మేధావులతో కమిటీ ఏర్పాటు చేసి మద్యంతో కలిగే అనర్థాలను ప్రచారం చేస్తామన్నారు.