యాప్నగరం

పంచాయతీ ఎన్నికలపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆసక్తికర వ్యాఖ్యలు

Panchayati Electionsపై ప్రతిష్టంభన తొలగలేదు... ఎన్నికల సంఘం వెనకడుగు వేయలేదు... ప్రభుత్వం పట్టు వీడలేదు. ముందుగా ప్రకటించినట్టే ఎస్ ‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు

Samayam Telugu 25 Jan 2021, 8:22 am
కరోనా టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న ప్రకటనపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం శనివారం తెనాలి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇంతకు ముందు పనిచేసిన ఉద్యోగులు రాజ్యాంగ స్ఫూర్తితో త్యాగాలకు సిద్ధపడి పనిచేశారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం


రామతీర్థం చేరిన రాములోరి విగ్రహాలు.. బాలాలయంలో జనవరి 28న ప్రతిష్ఠ
అలాంటి అధికారులను అందరూ గుర్తుంచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉద్యోగులు ప్రాణాలను త్యాగం చేయాల్సిన అవసరం లేకపోవచ్చని ఎల్వీ అభిప్రాయపడ్డారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు.. మనం రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎన్నికల నిర్వహణలో తమ రక్షణకు సంబంధించిన అన్ని సౌకర్యాలను నిర్భయంగా ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని అడిగి పొందాలని ఆయన సూచించారు.

రామమందిర నిర్మాణానికి మాజీ ఎంపీ రూ.5 కోట్ల విరాళం
కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనడం తమ ప్రాణాలకు సంబంధించిన అంశమని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించిని విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని, మాకు రక్షణ కల్పించాల్సిన అవసరముందని అంటున్నారు. టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని, ముందుకొచ్చే ఉద్యోగులతో ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల నేత వ్యాఖ్యలు ప్రాణహాని కలిగించే బెదిరింపులే: డీజీపీకి ఎస్‌ఈసీ ఫిర్యాదు!
శనివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఈ తరుణంలో రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కారు సహకరించకపోయినా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం దూకుడుగా ముందుకుపోతున్నారు.

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ తాము కూడా రక్షణ కోరుతున్నామని అన్నారు. ఉద్యోగులు, వారి రక్షణ గురించి మాత్రమే మాట్లాడానని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమిటని అడిగామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.